(చంపూవినోదిని, ఋతుఘోష, పక్షులు, పద్య కావ్యాలు, తదనంతర వచన, గేయ, పద్య కవితలు) మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది – ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ. వాల్మీకి రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాగే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశమ్. ఇదేవిధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన హోమర్ విరచిత ఇలియడ్ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశమ్ వచ్చింది. ***** జనవంశమ్ ఆధునిక మహాభారతము కావ్యేతిహాసానికి అనుబంధ కావ్యం. ఆధునిక మహాభారతము పూర్తిగా వచనకవిత. జనవంశమ్ దీనికి భిన్నమైంది. ఇందులో ఛందోబద్ధ పద్యాలు, గేయాలు, పాటలు, వచన కవితలు, చమత్కారికలు అన్నీ ఉన్నాయి. భావతీవ్రత, అభివ్యక్తి ఉష్ణోగ్రత అదే స్థాయిలో ఉంటాయి. స్థాయీ భేదాలుండే వివిధ వర్గాల పాఠకులందరినీ తప్పక ఆకట్టుకునే మహాకావ్యం జనవంశమ్. ***** నగరం ఒక చంబల్ వ్యాలీ అరే ఈ దేశం మీకేమిచ్చింది ***** పత్రిక ముట్టుకుంటే చాలు పామైకరుస్తోంది ***** ఇండియాలో కుక్కలన్నీ ***** బాబూనీ చిన్ని కన్నీటి బిందువులో - శేషేంద్ర ***** ఎన్నిరోగాలైనా సరే ఎన్నికలమందుతోనే నయంచేస్తారనే భూతవైద్యులు బాబూ దేశం నెత్తిన పెట్టారు శుష్క ప్రజాస్వామ్య శూన్యహస్తం- అంటూ మన డొల్ల స్వాతంత్య్రాన్ని నిలదీస్తూ స్వాతంత్రదినోత్సవ సందర్భంగా వస్తోంది... జనవంశమ్.జనవంశమ్ : శేషేంద్ర |